News December 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులు Dy.CM పర్యటన

Dy.CM మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మంలో జరిగే నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధిరలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటనలో వివరించారు.
Similar News
News April 13, 2026
122 బంతులు.. 0 వికెట్.. బుమ్రాకు ఏమైంది?

యార్కర్లు, స్లో బౌన్సర్లు, లో ఫుల్ టాస్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బుమ్రాకు ఈ IPL కలిసి రావట్లేదు. గతేడాది MI ఆడిన చివరి మ్యాచ్, ఈ సీజన్ 4 మ్యాచుల్లో ఒక్క వికెట్టూ దక్కలేదు. 2025లో PBKSపై(0-40), 2026లో KKRపై(0-35), DCపై(0-21), RRపై(0-32), RCBపై(0-35) పేలవ గణాంకాలు నమోదు చేశారు. 122 బంతులు వేసినా వికెట్ రాలేదు. బుమ్రా IPL కెరీర్లో వికెట్ తీయకుండా ఇన్ని బాల్స్ వేయడం ఇదే తొలిసారి.
News April 13, 2026
మలయప్పస్వామి గురించి మీకు తెలుసా?

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్ప స్వామిని ఊరేగించారని వార్తల్లో వింటుంటాం. అయితే ఈయన కూడా శ్రీవారే. మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలోని మూలమూర్తి స్థిరంగా ఉండగా, భక్తులను కటాక్షించడానికి వారి వద్దకు కదులుతూ వచ్చే స్వామియే మలయప్పస్వామి. మలయప్పకోన అనే ప్రాంతంలో ఈ విగ్రహాలు లభించాయి.
News April 13, 2026
చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక

చిత్తూరు జిల్లాలో ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఈఈ సెట్కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంటర్ పూర్తిచేసిన వాళ్లు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. 17 ఏళ్లు నిండాలని, గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


