News April 21, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ CM కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్షోలు, బస్సు యాత్రలు చేపట్టనున్నారు. BRS పార్టీ రోడ్షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ నెల 29న ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో ఉండనుంది. 30న తల్లాడ, కొత్తగూడెంలో మాజీ సీఎం రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
Similar News
News November 11, 2025
విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
News November 11, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత పటిష్టం చేయాలి: కలెక్టర్

ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. సీల్స్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, సైరన్ పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టులు, విధులను తెలుసుకొని, భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. తనిఖీలో రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, ఎన్నికల సూపరింటెండెంట్ రాజు పాల్గొన్నారు.
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


