News March 23, 2024
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజుల బస్సు యాత్ర: పెద్దిరెడ్డి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 2న పీలేరు, 3న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర, నాయకులతో సమావేశం, 4న తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర.. శ్రీకాళహస్తి లేదా నాయుడుపేటలో నాయకులతో సమావేశం జరుగుతుందన్నారు.
Similar News
News April 20, 2025
చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 20, 2025
DSC: చిత్తూరు జిల్లాలో 1,473 పోస్టుల భర్తీ

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:38
➤ హిందీ:17 ➤ ఇంగ్లిష్: 104
➤ గణితం: 30 ➤ఫిజిక్స్: 29
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 130
➤ పీఈటీ: 86 ➤ఎస్జీటీ: 976
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
News April 20, 2025
పలమనేరు PGRSకు రానున్న కలెక్టర్

పలమనేరులో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొంటారని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. పలమనేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఉదయం 9:30 గం. ప్రారంభవుతుందని, స్వయంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.