News April 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News December 30, 2025
ఇంటి వద్దే వేడుకలు చేసుకోండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకలను సామాజిక బాధ్యతతో, సంయమనంతో జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి విలువలు ప్రతిబింబించేలా కొత్త ఏడాదిని స్వాగతించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
News December 30, 2025
పాలమూరు: సంపులో పడి 18 నెలల బాలుడి మృతి

మామిడి తోటలోని నీటి సంపులో పడి ఓ బాలుడి మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి మండలం మాచర్లలో చోటుచేసుకుంది. వంగూరు మండలానికి చెందిన మల్లేష్, మంజుల దంపతులు మాచర్లలో మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మంగళవారం పనుల నిమిత్తం తమ 18 నెలల కుమారుడు హర్షిత్ను తోటలోకి తీసుకెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
News December 30, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.1976, కనిష్ఠ ధర రూ.1976, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.1950, కనిష్ఠ ధర రూ.1850, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2711, కనిష్ఠ ధర రూ.2711 ధర పలికింది. నేడు మార్కెట్లో 32 బస్తాల కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


