News December 24, 2025
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.9℃గా నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 11.0℃గా నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 11.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 11.4℃ల టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరి మీ ఏరియాలో చలి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 31, 2025
మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News December 31, 2025
25వేల పోస్టులు.. కాసేపట్లో ముగుస్తున్న గడువు

కేంద్ర సాయుధ పోలీస్ దళాల (CAPF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీ గడువు ఈ రాత్రి గం.11తో ముగియనుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, AR విభాగాల్లో 25487 ఖాళీలున్నాయి. పోస్టులను బట్టి SSC ఆపై విద్యార్హత, 2026 JAN 1కి 18-23సం.ల వయస్సు వారు అర్హులు. ఏజ్పై పలు రిజర్వేషన్లతో పాటు NCC సర్టిఫికెట్ ఉంటే బోనస్ మార్క్స్ ఉంటాయి. అప్లై, ఇతర వివరాలకై SSC అధికారిక సైట్కు వెళ్లండి.
Share It
News December 31, 2025
మెదక్: 9 చెరువుల నుంచి నీరు విడుదలకు నిర్ణయం: కలెక్టర్

రబీ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న 9 చెరువుల నుంచి పంటలకు నీరు విడుదలకై చర్చించి నిర్ణయించినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. పెద్ద చెరువు కొంటూరు, హైదర్ చెరువు నార్లాపూర్, రాయరావు చెరువు నర్సాపూర్, దేవతల చెరువు వెల్దుర్తి, హల్దీ వాగు ప్రాజెక్టు హకీంపేట్, పెద్ద చెరువు అంబాజీపేట ఉన్నాయి.


