News December 30, 2025

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో అత్యల్పంగా 9.9℃ల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతానికి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోటలో 10.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌ నగర్‌లో 10.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 1, 2026

విజయవాడ మహిళకు అమెరికాలో అదనపు కట్నం వేధింపులు.!

image

విజయవాడలోని అంబాపురానికి చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లిలో ₹40 లక్షల నగదు, ₹25 లక్షల బంగారం ఇచ్చినా, అమెరికా వెళ్లాక కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేయడంతో ఒత్తిడికి లోనై శిశువును కోల్పోయినట్లు తెలిపింది. వేధింపులు తాళలేక స్వదేశానికి తిరిగి వచ్చి భర్త, కుటుంబంపై పోలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

News January 1, 2026

తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం

image

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.