News June 4, 2024
ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 34.3, వనపర్తి జిల్లా దగడలో 33.1, గద్వాల జిల్లా అలంపూర్లో 32.4, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 31.7 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.
Similar News
News September 16, 2025
MBNR: ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డా.రామరాజు

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డాక్టర్ పండుగ రామరాజు నియామకమయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు డాక్టర్ పండుగ రామరాజుకు నియమక పత్రం అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, బిట్స్ పిలానీలో పీహెచ్డీ, ఐఐటి మద్రాస్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. డా.ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు.
News September 16, 2025
నేరస్థుల శిక్షల శాతం పెంచాలి: ఎస్పీ

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించి ప్రతి కేసును పారదర్శకంగా లోతైన విచారణతో ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో తదితర కేసుల విషయంలో అధికారులకు ఎస్పీ పలు సూచనలు సలహాలను అందించారు.
News September 16, 2025
మిడ్జిల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. చిల్వర్ గ్రామానికి చెందిన రాములు బైక్ వెళ్తూ ఆగి ఉన్న బొలెరోను ఢీన్నాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.