News March 19, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

✔నేడు పలు రైతు వేదికల్లో దృశ్య శ్రవణ ప్రసారం
✔పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔WNPT:ఎన్నికల కోడ్..246 నియామకాలకు బ్రేక్
✔ELECTION-EFFECT..ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ఓటు శాతం పెంచేందుకు అధికారుల నజర్
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్
✔ఉపాధి హామీ పనులపై సమీక్ష
✔ రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(మంగళ)-6:34,సహార్(బుధ)-5:01
✔NGKL:నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత
Similar News
News August 15, 2025
MBNR: పోలీసు పరేడ్ మైదానంలో.. స్వాతంత్ర్య వేడుకలు

MBNRలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
News August 15, 2025
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
News August 15, 2025
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపనలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.