News September 30, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

❤U-19 టోర్నీ.. నల్గొండ పై పాలమూరు ఘనవిజయం
❤ధన్వాడ: 3 నుంచి రెజ్లింగ్ పోటీలు
❤3 నుంచి ఓపెన్ SSC,INTER సప్లిమెంటరీ పరీక్షలు
❤బిజినపల్లి:లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
❤కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జులై వేతనాలు విడుదల
❤నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
❤మద్యం సేవించి వాహనాలు నడపరాదు:SIలు
❤ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి:CPM
❤వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలి:BKMS
Similar News
News November 2, 2025
MBNR: అక్టబర్లో 21 రెడ్హ్యాండెడ్ కేసులు

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
News November 2, 2025
MBNR: జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల అప్పగింత

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ‘AHTU’ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కళాశాలలు, గ్రామాల్లో ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు. అధికారులు 30 హాట్స్పాట్ ప్రాంతాలను సందర్శించి సమాచారాన్ని సేకరించారు. కురుమూర్తి జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి తమతమ కుటుంబాలకు అప్పగించారు.
News November 2, 2025
MBNR: SSC విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆదేశాల మేరకు SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల సమయ పట్టికను రూపొందించామని డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల విద్యాప్రగతిని పెంపొందించి రాబోయే SSC పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉదతయం 8:15 నుంచి 9:15 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు క్లాసులు జరుగుతాయని పేర్కొన్నారు.


