News October 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤MBNR:19న అండర్-14,17 కరాటే ఎంపికలు❤రేపు ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక❤కొత్త ఉపాధ్యాయులకు ఘన సన్మానం❤PUలో రేపు,ఎల్లుండి సౌత్ జోన్ ఎంపికలు❤దుద్యాల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి❤GDWL: రైలు కిందపడి ప్రభుత్వ టీచర్ మృతి❤రేపు అలంపూర్‌కు మంత్రుల రాక❤ఈనెల 31 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు❤జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్ల మూసివేత

Similar News

News October 18, 2024

MBNR: 14 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేరు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో‌‌ పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

News October 18, 2024

MBNR: ఈ నెల 19న కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ పట్టణంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 19న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయ్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరు కావాలని సూచించారు.
-SHARE IT..

News October 17, 2024

గద్వాల: రైలు కిందపడి ప్రభుత్వ టీచర్ మృతి

image

రైలు కిందపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధికి చెందిన శేఖర్ ప్రభుత్వ టీచర్. కాగా15రోజులుగా మానసికంగా ఇబ్బందిపడున్నాడన్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం రైల్వే పట్టాలపైకి వెళ్లి రైలు కిందపడి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.