News June 26, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలివే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719371571465-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోటకొండలో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా జానంపేటలో 8.8 మి.మీ, గద్వాల జిల్లా అలంపూర్లో 5.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా సెరివెంకటాపూర్ 3.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లి 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News June 29, 2024
నాగర్ కర్నూల్: భర్తను చంపిన భార్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719603947863-normal-WIFI.webp)
భర్తను భార్య కిరాతకంగా బండరాయి, కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. శివశంకర్(35) హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివలీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. శివశంకర్కు తన ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. ఆవేశానికి గురైన శివలీల, శివశంకర్ తలపై బండరాయి, కర్రతో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు
News June 29, 2024
MBNR: ‘పది’ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719622234052-normal-WIFI.webp)
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,238 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. MBNR-70.21శాతం, GDWL-87.80 శాతం, WNPT-95.36శాతం, NGKL-93.40 శాతం, NRPT-76.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
News June 29, 2024
షాద్నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719589834101-normal-WIFI.webp)
షాద్నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.