News September 18, 2024
ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సన్నద్ధం !
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News September 29, 2024
MBNR: దివ్యాంగుడిని బ్రతికుండగానే చంపేశారు!
బతికున్న వ్యక్తిని ఆసరా పింఛను పోర్టల్లో చనిపోయినట్లు నమోదు చేయడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ మండలం ఖాన్దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు దివ్యాంగ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పెన్షన్ మంజూరు కాలేదని ఆరా తీయగా.. అధికారులు ఆసరా పోర్టల్లో చూసి’ నీవు చనిపోయినట్లు ఆసరా పోర్టల్లో ఉంది’ అని తెలిపారు. దీంతో హన్మంతు 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
News September 29, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయపల్లిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 35.0 డిగ్రీలు, గద్వాల జిల్లా తోతినొనిద్దోడిలో 35.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 33.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా బిజ్వార్లో 32.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 29, 2024
NGKL: లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
కేసు డీల్ చేస్తానని లంచం తీసుకున్న కానిస్టేబుల్ వినోద్ రెడ్డిపై SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. బిజినపల్లి(M) గంగారం గ్రామానికి చెందిన సురేష్ ప్రేమ వివాహం చేసుకొని స్వగ్రామానికి రాగా యువతి కుటుంబీకులు అతడిపై దాడిచేసి యువతిని తీసుకువెళ్లారు. సురేష్ 100కు ఫోన్ చేయగా వినోద్ రెడ్డి గ్రామానికి వెళ్లి మీ కేస్ డీల్ చేస్తానని రూ.2 వేలు తీసుకున్నాడు. దీంతో వినోద్ రెడ్డిని సస్పెండ్ చేశారు.