News January 10, 2026

ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపిక పూర్తి

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఖోఖో క్రీడాకారుల ఎంపికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది బాలబాలికలు హాజరైనట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ప్రాబబుల్స్ కోసం 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Similar News

News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 26, 2026

గుంటూరు: 350 మందికి అవార్డులు

image

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.

News January 26, 2026

సింగరేణిలో రూ.6 వేల కోట్ల కుంభకోణం: కొప్పుల ఈశ్వర్‌

image

సింగరేణిలో సైట్‌ విజిట్‌ పేరుతో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.6,000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తదితరులు పాల్గొన్నారు.