News January 16, 2026

ఉమ్మడి జిల్లా నీటి సమస్యలు పరిష్కరించాలి: ఎంపీ నగేశ్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం 26 27 ప్యాకేజీ అసంపూర్తిగా ఉందని, దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ముప్పు గ్రామాల సమస్యలు పరిష్కరించాలన్నారు.

Similar News

News February 5, 2026

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

image

దక్షిణ మధ్య రైల్వే(SCR)లో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు తెలియనివారు ఉండరేమో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును 1974లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. 52 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైలును ఫిబ్రవరి 2న అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

News February 5, 2026

కర్నూలులో పడిపోయిన ధరలు

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధరలు పడిపోయాయి. క్వింటా గరిష్ఠంగా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8 వేల లోపు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.2,609, గరిష్ఠ ధర రూ.7,901కు అమ్ముడుపోయాయి. నిన్న మార్కెట్‌కు 3,655 క్వింటాళ్ల కందులు వచ్చాయి.

News February 5, 2026

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? ఇలా చేయండి..!

image

రైలులో ప్రయాణిస్తున్నారా..? ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాకుండా Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్నా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.