News March 24, 2024
ఉమ్మడి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, సమావేశాలు ఏర్పాటు విషయమై చర్చించామని నేతలు తెలిపారు. పాలమూరు మహాసభకు రాహుల్ గాంధీ ఆహ్వానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News December 28, 2025
MBNR: U-14..హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల, బాలికలకు హ్యాండ్ బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. మొత్తం 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారు నారాయణపేటలో నేటి నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు హాజరవుతున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు.పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్,గనేశ్వరి పాల్గొన్నారు.
News December 27, 2025
మహబూబ్నగర్: ఈనెల 29న మహిళల క్రికెట్ జట్టు ఎంపిక

పాలమూరు విశ్వవిద్యాలయం మహిళల క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసులు శనివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు (17-25 ఏళ్ల వారు) ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో హాజరుకావాలని సూచించారు.
News December 27, 2025
MBNR: కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో జిల్లా కోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ భూమిపూజ చేశారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు జిల్లా సెషన్ న్యాయమూర్తి ప్రేమలత, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.


