News March 31, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రూ. 2.72 కోట్లు 

image

వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నగర, పురపాలికలకు వివిధ పనులకు సంబంధించి రూ.2.72 ఓట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి సరఫరాకు, పైప్ లైన్‌లో మరమ్మత్తులకు ఈ నిధులు వినియోగించుకోవాలి. నిజామాబాద్ రూ.96.30 లక్షలు, బాన్సువాడ 38.12, ఎల్లారెడ్డి 35.36, బోధన్ 52.44, కామారెడ్డి 28.31, ఆర్మూర్18.24, బాన్సువాడ 4.19 వచ్చాయి.

Similar News

News April 22, 2025

ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

image

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 22, 2025

నిజామాబాద్: 59.25 శాతం ఉత్తీర్ణత: DIEO

image

ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో 59.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. వార్షిక పరీక్షల్లో జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు.

News April 22, 2025

NZB:  జిల్లా నూతన జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

image

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన G.V.N. భరతలక్ష్మిని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వుల మొక్కను అందజేశారు. ఇరువురు పాలనా పరమైన అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను నూతన జడ్జీకి సీపీ వివరించారు.

error: Content is protected !!