News July 7, 2025

ఉమ్మడి పాలమూరు గిరిజనులకు GOOD NEWS

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన నియోజకవర్గాలకు మొత్తం 8,750 ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 1,319 ఇండ్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. ఈ లబ్ధిదారులకు ఈరోజు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అచ్చంపేటలోని మున్ననూర్‌లో మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు.

Similar News

News July 7, 2025

ఈ నెల 13న ఓదెల మల్లన్న పెద్దపట్నం

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పెద్దపట్నాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 13న స్వామి వారి పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గణపతి పూజ పుణ్యహవాచనము, మంటస్థాపన, శ్రీ వీరభద్రరాధన, రాత్రి 10 నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు అగ్నిగుండ ప్రజ్వలన, పెద్దపట్నం నిర్వహిస్తున్నామని తెలిపారు.

News July 7, 2025

HYD: ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్.. హైడ్రా కీలక సూచన

image

భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. NRI వ్యక్తులు, పెట్టుబడిదారులు భూ కొనుగోలుకు ముందు HMDA వెబ్‌సైట్ ద్వారా FTL, బఫర్‌జోన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. హైడ్రా కూడా చెరువుల FTL నోటిఫికేషన్ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తోంది. శాటిలైట్ డేటా, 2006 మ్యాప్స్ ఆధారంగా త్వరలో 15 సెం.మీ. రిజల్యూషన్‌తో 3Dమోడల్స్ రూపొందిస్తున్నారన్నారు.

News July 7, 2025

Gift A Smile.. 4,910 మందికి కేసీఆర్ కిట్లు: KTR

image

TG: ఈనెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా సిరిసిల్లలోని 4,910 మంది తల్లులకు KCR కిట్లు అందజేస్తామని KTR ప్రకటించారు. ‘2020 నుంచి నా బర్త్ డే రోజున ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం చేపడుతున్నాం. 2020లో 108 అంబులెన్సులు, 2021లో 1400+ మంది దివ్యాంగులకు ట్రై వీల్ చైర్లు, 2022లో 6వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, 2023లో 116 మందికి ల్యాప్‌టాప్‌లు, 2024లో చేనేత కార్మికుల కుటుంబాలకు సాయం చేశాం’ అని పేర్కొన్నారు.