News July 31, 2024
ఉమ్మడి పాలమూరు నేటి ముఖ్య వార్తలు

✔NGKL: ఆటో బోల్తా.. 10మందికి గాయాలు
✔3డే లీగ్లో ఆకట్టుకున్న పాలమూరు బౌలర్లు
✔రుణమాఫీ.. సీఎం చిత్రపటానికి పాలభిషేకం
✔అర్హులకు పదోన్నతులు: DEOలు
✔NGKL: రేపు కేజీబీవీ సరుకుల టెండర్లు
✔SDNR: రైలు కిందపడి యువకుడి మృతి
✔NGKLలో గంజాయి కలకలం
✔పలుచోట్ల మోస్తారు వర్షం
✔MBNR:కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు
✔సభను తప్పుదోవ పట్టించడమే బీఆర్ఎస్ పని:MLA పర్ణిక రెడ్డి
✔ఓపెన్ టెన్త్, ఇంటర్ దరఖాస్తుల ఆహ్వానం
Similar News
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్నగర్లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.