News October 15, 2024
ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప.గో జిల్లాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ను నియమించారు. అలాగే ఏలూరు జిల్లాకు మంత్రి నాదెండ్ల నియమితులయ్యారు. వారు జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వాములు కానున్నారు.
Similar News
News October 15, 2024
ఏలూరు జిల్లాలో 12 మంది మహిళలకు వైన్ షాపులు
ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో పలువురు మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499 మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అయితే వీరిలో 12 మంది మహిళలు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కైవసం చేసుకున్నారు.
News October 14, 2024
ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News October 14, 2024
నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.