News August 29, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో ‘హైడ్రా’ మాట

image

చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైదరాబాద్‌లో ‘హైడ్రా’ నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ‘హైడ్రా’ అవసరం మన ఉమ్మడి. ప.గో జిల్లాకు కూడా అవసరం ఉందని ఊర్లలో చర్చలు నడుస్తున్నాయి. ఇరగవరం, ఆచంట, ఆకివీడు, భీమవరం ఇలా చాలా మండలాల్లో ఆక్రమణలు చాలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఉమ్మడి జిల్లాలో 11 పంట కాలువలు, వందల బోదెలుండగా, వాటిలో చాలా వరకు ఆక్రమించేశారని ఆరోపణలు వస్తున్నాయి.

Similar News

News February 16, 2026

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: SP

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 15 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూవివాదాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను SP ఆదేశించారు.

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

News February 16, 2026

ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

image

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.