News February 27, 2025

ఉమ్మడి ప.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి పలుకుటుంబాలకు తీరని విషాదం మిగిల్చింది. ఏలూరులో బలివే క్షేత్రానికి వెళ్లొచ్చి చెరువులో స్నానానికి దిగి వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆచూకీ తెలియలేదు. లింగపాలేనికి చెందిన అన్నదమ్ములు మణికుమార్, మునియ్య తమ్మిలేరులో మునిగి చనిపోయారు. పట్టిసీమలో నాగవీరభద్ర రావు, బలివే క్షేత్రానికి వచ్చిన అన్నవరం గుండెపోటుతో మృతి చెందారు.

Similar News

News February 21, 2026

ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

image

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.

News February 21, 2026

ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

image

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

News February 21, 2026

NTR: లంచం కొట్టు.. ఆ తర్వాతే పన్ను కట్టు!

image

విజయవాడ కార్పొరేషన్‌లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ.15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని, కమిషనర్ స్పందించి లంచాలని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.