News November 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో‌ KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్‌ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.

Similar News

News November 2, 2025

మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

image

మెదక్​ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. మెదక్​ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.

News November 1, 2025

నర్సాపూర్: ‘ఎకో పార్కు, చెరువు డంపింగ్ యార్డ్ కావద్దు’

image

నర్సాపూర్ శివారులో నిర్మించిన నూతన ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్ కావద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన ఎకో పార్కును మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్‌లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

News November 1, 2025

మెదక్: బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతలు వీరే..

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతలు వీరే. ఓపెన్‌ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్‌లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.