News October 8, 2025
ఉమ్మడి వరంగల్లో విష జ్వరాలతో మృత్యువాత..!

విషజ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ములుగు(D) వాజేడులో నర్సింగ్ విద్యార్థిని అంజలి, నెక్కొండ(M) గుండ్రపల్లిలో చిన్నారి సహస్ర, లింగాలఘణపురం(M) మాణిక్యాపురంలో మహేష్ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,12,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 తగ్గి రూ.1,67,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 8, 2025
అనకాపల్లి: 9 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు

ఉమ్మడి విశాఖ జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో 2007 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. గోపాలపట్నంలో 9న బ్యాట్మెంటన్, నక్కపల్లిలో 10న హాకీ, పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల కబడ్డీ, క్రికెట్, చెస్ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు.
News October 8, 2025
‘అనకాపల్లి-తిరుపతి ట్రైన్లో జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి’

అనకాపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్లో సామాన్య ప్రయాణికులకు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం అనకాపల్లి నుంచి నడిచే ఈ రైల్లో అన్ని ఏసీ బోగీలో కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు నిరాశ పడుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు.