News April 24, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాలలో బాలికలదే పైచేయి

➤ పార్వతీపురం మన్యం జిల్లాలో 5,099 మంది బాలురు పరీక్ష రాయగా.. 95.33శాతంతో 4,861 మంది పాసయ్యారు. 5,344 మంది బాలికలు పరీక్ష రాయగా 97.36శాతంతో 5,203 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ విజయనగరం జిల్లాలో 11,868 మంది బాలురు పరీక్ష రాయగా.. 89.91శాతంతో 11,081 మంది పాసయ్యారు. 11,822 మంది బాలికలు పరీక్ష రాయగా 93.73శాతంతో 11,081 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News July 10, 2025
VZM: 2,232 పాఠశాలలు, కాలేజీల్లో మీటింగ్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ గురువారం జరిగింది. జిల్లాలోని 2,232 పాఠశాలల్లో 2,10,377 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని 180 జూనియర్ కళాశాల్లోనూ ఈ మీటింగ్ జరిగింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు టీచర్లు, లెక్చరర్లు వివరించారు..
News July 10, 2025
VZM: అభ్యంతరాలు ఉంటే చెప్పండి

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో పొందుపరిచామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల తెలిపారు. 20 విభాగాల్లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 12 విభాగాలకు సంబంధించి స్పీకింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాబితా https://vizianagaram.nic.inలో అందుబాటులో ఉందని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆమె కోరారు.
News July 10, 2025
VZM: అగ్నిపథ్లో అవకాశాలు

అగ్నిపథ్ పథకంలో భాగంగా భారతీయ వాయుసేనలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 4 ఏళ్ల కాల పరిమితికి అగ్నివీర్(వాయు)గా చేరడానికి అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 11న ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జులై 31న రాత్రి 11 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.