News April 15, 2025

ఉమ్మడి విశాఖ జిల్లాలో 111 పోస్టులు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 111 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 59 SGT(ప్రాథమిక స్థాయి), 52 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News April 18, 2025

18th Anniversary: IPL స్పెషల్ పోస్టర్

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమై నేటితో 18 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా IPL X హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘కలలు నిజమయ్యాయి.. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘18 ఏళ్ల IPL జర్నీపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండి?’ అని ఫ్యాన్స్‌ను కోరింది. COMMENT

News April 18, 2025

‘ఫ్రెంచ్ ఓపెన్‌’లో నాదల్‌కు సన్మానం

image

వచ్చే నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆరోజున తమ దేశపు ఆటగాడు, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు సన్మానం చేయాలని నిర్ణయించినట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గిల్లెస్ మోరెటాన్ ప్రకటించారు. ‘రోలాండ్ గారోస్‌లో నాదల్‌కు మరెవరూ సాటిలేరు. ఇక్కడ ఆయన 14 టైటిళ్లు గెలిచారు. ఈ ఏడాది టోర్నమెంట్ ఆడకపోయినా ఆయన మాతో ఉంటారు. ఫ్రెంచ్ ఓపెన్‌కు రఫా ఓ గొప్ప రాయబారి’ అని ఆయన తెలిపారు.

News April 18, 2025

అనకాపల్లి: చెట్టుపై నుంచి పడి సచివాలయ ఉద్యోగి మృతి

image

మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం సచివాలయంలో ఉద్యానవన సహాయకుడిగా పనిచేస్తున్న రాజేశ్ మృతి చెందినట్టు ఎంపీడీవో సీతామాలక్ష్మి తెలిపారు. కోటవురట్ల మండలం అన్నవరం అతని స్వగ్రామమని పేర్కొన్నారు. అయితే శుక్రవారం అదే గ్రామంలో చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్లు వెల్లడించారు. కోటవురట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

error: Content is protected !!