News August 12, 2024
ఉమ్మడి విశాఖ నేతలతో భేటీ కానున్న జగన్

స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ఈనెల 13,14 తేదీల్లో ప్రత్యేక సమావేశాలను పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశాలు నిర్వహించారు. మిగిలిన వారితో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు.
Similar News
News September 23, 2025
విశాఖ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం

విశాఖ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్లాట్ ఫాంపై ఉన్న ఫుడ్ కోర్టులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. రిజర్వేషన్ కేంద్రాలను, టికెట్ బుకింగ్ కౌంటర్ లను,క్యాప్సిల్ హోటల్ను సందర్శించి పలు సూచనలు చేశారు. రానున్న దసరా సెలవు దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యాలు అందించాలని సూచించారు.
News September 23, 2025
ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదు: కమిషనర్

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. నగర ప్రజల ఆరోగ్యం, భద్రత సౌకర్యం కోసం దీన్ని ప్రారంభించామన్నారు. వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ద్వారా వారికి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తామన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వివరించారు.
News September 23, 2025
ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.