News January 31, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News July 9, 2025
ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.
News July 9, 2025
కామారెడ్డి: రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

KMR జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. KMR జిల్లాలో గతేడాది 3,16,242 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 3,18,530 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి గతేడాది 34,459 ఎకరాల్లో పండించగా ఈ ఏడాది 34,549 ఎకరాల్లో పండించవచ్చని పేర్కొన్నారు.
News July 9, 2025
రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.