News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738801991727_1292-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.
Similar News
News February 6, 2025
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738811831562_710-normal-WIFI.webp)
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.
News February 6, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763920221_60417652-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫర్నిచర్, విద్యుత్తు ఏర్పాట్లు, నీటి వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్ ఉన్నారు.
News February 6, 2025
ఇవాళ జగన్ ప్రెస్ మీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_102024/1728572175272_367-normal-WIFI.webp)
AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.