News October 20, 2025
ఉరవకొండలో ఆ రోజు.. దేవుడు మాట్లాడారు!

పుట్టపర్తి సత్యసాయి బాబా 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో తన అవతారాన్ని ప్రకటించారు. అబ్కారీ బంగ్లా సమీపంలోని రాతి గుండుపై కూర్చొని ‘నేను సత్యనారాయణుడు కాదు, సత్యసాయిని’ అని ప్రకటించారు. ఆ ప్రదేశంలో డా.నలబాల ఆంజనేయులు 2003లో భజన మందిరం నిర్మించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న అక్కడ రథోత్సవం జరుగుతుంది. అవతార ప్రకటన తర్వాత సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనసాగించారు.
Similar News
News October 20, 2025
వనపర్తి: దీపావళి.. ఎస్పీ కీలక సూచనలు

✓ పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చనివ్వాలి.
✓ రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దు.
✓ టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా నిలబడాలి.
✓ వెలగని టపాసులను మళ్లీ వెలిగించకూడదు.
✓ నీరు, ఇసుక బకెట్ దగ్గర ఉంచుకోవాలి.
✓ టపాసుల గోదాములు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలి.
✓ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే డయల్ 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.
News October 20, 2025
వనపర్తి: ఆనందోత్సాహాలతో దీపావలి జరుపుకోవాలి: కలెక్టర్

దీపావళి పర్వదినాన్ని వనపర్తి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకాంక్షించారు. దీపావళి పండుగ అంటే దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుతామన్నారు. అలాగే బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తత వహించాలన్నారు.
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.