News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News February 22, 2026
సభలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లొద్దు?: భూమన

AP: దేవాలయాల్లాంటి అసెంబ్లీ, మండలిలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లకూడదని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నోసార్లు బూట్లు ధరించే దేవుడి ఫొటోలను పలువురికి కానుకగా ఇచ్చారని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి శ్రీవారి ఫొటోలు తీసుకురావడంపై కూటమి నేతలు మండిపడిన సంగతి తెలిసిందే.
News February 22, 2026
మల్యాల: కాలువలో కారు బోల్తా.. BJP నేత మృతి

మల్యాల వరద <<19208074>>కాలువలో కారు బోల్తా<<>> పడిన ఘటనలో పెగడపల్లి(M) సుద్దపల్లికి చెందిన BJP నేత తిర్మని రమణ(53) మృతిచెందారు. ఈనెల 18న ఇంటి నుంచి కారులో వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో పెగడపల్లి PSలో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. MISSING కేసు నమోదైంది. కాగా మృతుడు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
News February 22, 2026
ఓవర్సీస్ విద్యానిధి పథకం.. రేపటి నుంచి దరఖాస్తులు

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి (₹20L వరకు సాయం) పథకానికి దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మార్చి 24 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 700కి పెంచింది. ఇందులో BCలకు 500, EBCలకు 200 చొప్పున కేటాయించారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు <


