News October 11, 2025
ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు.
Similar News
News October 11, 2025
జూబ్లీహిల్స్ ఎన్నిక ఎఫెక్ట్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల13న విడుదల కానున్నదని, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరారు.
News October 11, 2025
వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.
News October 11, 2025
BREAKING: HYD: మొయినాబాద్లో దారుణం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సురంగల్ గ్రామానికి చెందిన రామగళ్ల ప్రసాద్ అనే వ్యక్తి 250 గజాల ప్లాట్ విషయంలో తన బాబాయి అయిన రామగళ్ల శ్యామ్(45)పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. చేతులు, మెడపై నరికాడు. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.