News February 11, 2025
ఊట్కూర్: రెండు బైకులు ఢీ.. నలుగురికి గాయాలు

రెండు బైకులు ఢీకొని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరులోని మోడల సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపోర్ల గ్రామానికి చెందిన రాజు.. అన్న అంజిలయ్య, వదిన నాగమ్మతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఊట్కూర్కు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. 108లో వారిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 16, 2025
విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
News September 16, 2025
దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR: చంద్రబాబు

AP: దేశ రాజకీయాల్లో NTR ఒక సంచలనం అని CM చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో సజీవ చరిత్ర-1984 అనే పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR అని, ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని CBN తెలిపారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.
News September 16, 2025
సింగరేణి: ఖనిజ అన్వేషణలకు లైసెన్సులు జారీ

కొత్తగూడెం: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ.. జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్నకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్లోని టీ హబ్లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో వీటిని అందజేశారు.