News January 25, 2025

ఊరించడమే కాంగ్రెసోళ్ల పని: కుత్బుల్లాపూర్ MLA

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. నేడు, రేపు, మాపు అంటూ ఊరించడమే కాంగ్రెసోళ్ల పని అని, రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం..! అదిగో ఇస్తాం..! అంటూ ఊరిస్తున్నారే తప్ప, అర్హులకు అందించడం లేదన్నారు. పేదలకు పథకాలు అందకపోతే, కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. 

Similar News

News March 13, 2025

భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

News March 13, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్

News March 13, 2025

‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

image

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.

error: Content is protected !!