News April 2, 2025

ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

image

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News September 18, 2025

ప.గో: ఈ నెల 19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారిని ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులందరూ 18న సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రిసీవింగ్ సెంటర్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి 19న అమరావతికి బయలుదేరుతారని ఆమె వెల్లడించారు.

News September 18, 2025

ఉత్తరాఖండ్‌లో పేరేచర్ల యువకుడి మృతి

image

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం, కళ్యాణకట్ట వ్రతాలు కార్ పార్కింగ్ అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,522
ఆదాయం వచ్చింది.