News April 17, 2025

ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త!

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు. ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2025

వనపర్తిలో డిగ్రీ విద్యార్థిని MISSING

image

అలంపూర్‌కి చెందిన డిగ్రీ విద్యార్థిని వనపర్తి పట్టణంలో అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అలంపూర్ క్యాతూర్‌ వాసి దాసరి బిందు వనపర్తిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఈనెల 16 నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వనపర్తిలోని బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 19, 2025

GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.

News April 19, 2025

బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్: ట్రంప్

image

బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేశారు. ఓపెన్ బోర్డర్‌ రూపంలో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది క్రిమినల్స్‌ను అమెరికాలోకి రానిచ్చారని ఆరోపించారు. వారిలో హంతకులు, డ్రగ్ డీలర్స్, పిచ్చాస్పత్రుల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. వారిని దేశం నుంచి వెళ్లగొట్టడమే తన పని అని, అందుకే తనని ఎన్నుకున్నారని తెలిపారు. బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అని ఫైరయ్యారు.

error: Content is protected !!