News February 10, 2026

ఎంజీఎం ల్యాబ్‌లో నిలిచిన సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు

image

ఎంజీఎం ఆస్పత్రిలోని సెంట్రల్ ల్యాబ్‌లో సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు జరగడం లేదు. కెమికల్ కొరత కారణంగా పరీక్షలు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా అత్యవసర రోగులే ఉంటారు. చికిత్సకు ముందు సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ పరీక్ష ఆస్పత్రిలో లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పరీక్షలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు.

Similar News

News February 11, 2026

సిరిసిల్ల: 1 PM పోలింగ్ శాతం ఎంతంటే?

image

సిరిసిల్ల మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43.57 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39 వార్డులలో 81,959 మంది ఓటర్లకు గాను 35,711 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.68 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 22,762 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 11, 2026

వనపర్తి జిల్లాలో 1PM 52.70% పోలింగ్

image

వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలలో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 52.70% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
అమరచింత – 59.67%,
ఆత్మకూర్ – 54.05%,
కొత్తకోట – 53.26%,
పెబ్బేరు – 61.89%,
వనపర్తి 49.25% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 61890 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకునట్లు అధికారులు తెలిపారు.

News February 11, 2026

మక్తల్ 6వ వార్డుకు రీ-నోటిఫికేషన్: రాణి కుముదిని

image

మక్తల్ 6వ వార్డులో ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న ఆమె, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా, స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని కోరారు.