News April 14, 2025
ఎండపల్లి: అంబేడ్కర్ వేషధారణలో బాలుడు

ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడు తునికి శ్రీ కీర్తన్ అంబేడ్కర్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడకి అంబేడ్కర్ గొప్పదనం గురించి తమ గురువులు చెప్పారని అన్నారు. అంబేడ్కర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.
Similar News
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.
News January 8, 2026
ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది.
News January 8, 2026
తంగళ్ళపల్లి: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపూర్కు చెందిన సుధగోని పర్ష రాములు (48) గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతూ కుంగిపోయాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


