News April 14, 2025

ఎండపల్లి: అంబేడ్కర్ వేషధారణలో బాలుడు

image

ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడు తునికి శ్రీ కీర్తన్ అంబేడ్కర్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడకి అంబేడ్కర్ గొప్పదనం గురించి తమ గురువులు చెప్పారని అన్నారు. అంబేడ్కర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.

Similar News

News September 18, 2025

పలు ఆలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం(శ్రీశైలం)- P.రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం- కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం(కాణిపాకం)- V.సురేంద్ర బాబు
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం(ఇంద్రకీలాద్రి)- B.రాధాకృష్ణ
5.శ్రీ వేంకటేశ్వర ఆలయం(వాడపల్లి)- M.వెంకట్రాజు

News September 18, 2025

eAadhaar App.. ఇక మనమే అప్డేట్ చేసుకోవచ్చు!

image

ఆధార్ కార్డులో అప్‌డేట్స్ కోసం ఇక ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం eAadhaar App తీసుకొస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల డిజిటల్ ఆధార్ సేవలు సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నవంబర్‌లో యాప్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

News September 18, 2025

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి రోజారమణిపై సర్వత్రా ప్రసంశలు

image

సంచలన తీర్పులతో పోక్సో చట్టం ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి రోజారమణి సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి. జూలై 4 నుంచి 16 వరకు ఆమె 10 కేసులలో తీర్పులివ్వగా, అందులో ఒక కేసులో ఉరిశిక్ష, మిగతా కేసులలో 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తూ తీర్పులిచ్చారు. బాధితులకు ₹.5 లక్షల-₹.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా ఓ తీర్పులో దోషి ఊశయ్యకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు.