News February 7, 2025
ఎంపీటీసీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీలు 5, జీపీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC- 230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.
Similar News
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News December 17, 2025
నరసరావుపేట TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా కోమ్మాలపాటి.!

నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కోమ్మాలపాటి శ్రీధర్ నియామకం దాదాపు పూర్తి అయింది. శ్రీధర్ 2024 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పని చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం మల్లీ ఆయనవైపే మొగ్గు చూపిస్తోంది. 2009, 2014లో ఆయన రెండు సార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో అక్కడ భాష్యం ప్రవీణ్కు అవకాశం కల్పించారు.


