News September 4, 2025

ఎంపీడీవోలు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వివిధ మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో జిల్లాలో 15వ ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారో సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు.

Similar News

News September 5, 2025

గురువులు సమాజ నిర్దేశకులు: చిత్తూరు MLA

image

గురువుల సమాజ నిర్దేశకులని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి మరువలేనిదని కొనియాడారు. గురువులకు ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తెలియజేశారు.

News September 5, 2025

7న కాణిపాకం ఆలయం మూసివేత

image

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధుడి ఆలయాన్ని ఈనెల 7వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు. గ్రహణం విడిచిన తర్వాత 8వ తేదీ ఉదయం 4 గంటలకు ఆలయం శుద్ధి చేస్తామన్నారు. స్వామికి అభిషేకం చేసి ఉదయం 6గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలను సైతం క్లోజ్ చేస్తారు.

News September 5, 2025

చిత్తూరు జిల్లాలో ఇంటర్ పూర్తి చేశారా?

image

చిత్తూరు జిల్లాలో ఉచిత పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. ఇంటర్‌లో 40శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న ఈనెల 8వ తేదీలోపు అఫ్లికేషన్ ఫిల్ చేసి చిత్తూరులోని DMHO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు www.appmb.co.in వెబ్‌సైట్ చూడాలన్నారు.