News May 12, 2024

ఎంపీ ఎన్నికలు.. ఆకుపై ఓటు చిత్రం అదుర్స్

image

ఓటు వజ్రాయుధం, ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అశ్వత్థ పత్రంపై ఓటు సింబల్ గీసి గిశారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, మన ఓటుతో సుస్థిర, సమర్థవంతమైన భారత దేశాన్ని నిర్మిద్దామని ఆర్టిస్ట్ ఆకాంక్షించారు. ‘మై ఓటు ఈస్ మై ఫ్యూచర్, పవర్ అఫ్ వన్’ ఓటు అని అన్నారు.

Similar News

News November 3, 2025

మెదక్: 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.

News November 2, 2025

మెదక్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న మూడు రోజుల్లో మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం తెలిపారు. ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడాలని, రైతులకు వర్షం వల్ల ఎలాంటి అసౌకర్యం, ధాన్యం తడిచి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

News November 2, 2025

మెదక్: స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు: కలెక్టర్

image

భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన 10 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ ఆదివారం వివరించారు. 10 రోజుల్లో తహశీల్దార్‌ల పరిధిలో 183, ఆర్డీవోల పరిధిలో 661, కలెక్టర్ స్వయంగా 168 ఫైల్స్ క్లియర్ చేసి జిల్లాలో 1012 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు.