News October 4, 2024

ఎచ్చర్ల: బీఆర్ఏయూలో మిగులు సీట్లకు ప్రవేశాలు

image

డా.బీఆర్ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగులు సీట్లకు తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ సుజాత తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రవేశాలు కొనసాగుతాయన్నారు. ఐసెట్-2024లో ఉత్తీర్ణత చెంది ఇప్పటివరకూ సీటు లభించిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చని చెప్పారు. అన్ని ధ్రువపత్రాలతో యూనివర్సిటీలో హాజరుకావాలన్నారు.

Similar News

News October 4, 2024

DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి

image

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.

News October 4, 2024

ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు

image

కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం,స్థానిక నాయకులు, ప్రజలకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.

News October 4, 2024

శ్రీకాకుళం: ‘ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో తల్లిపాల కేంద్రాలు ఏర్పాటుచేయండి’

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని RTC కాంప్లెక్స్‌లలో తల్లిపాలు పట్టే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం సూచించారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జిల్లా ప్రజా రవాణాధికారి విజయ కుమార్ నేతృత్వంలో వివిధ ఆర్టీసీ డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు ఆర్టీసీ డిపోల సభ్యులు సహకరించాలని కోరారు.