News March 27, 2024

ఎచ్చెర్ల : పరీక్ష ఫీజు స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షలకు ఫీజు స్వీకరణ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 15లోగా చెల్లించవచ్చని కోరారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు.

Similar News

News September 8, 2025

SKLM: కుల బహిష్కరణ చేశారంటూ వ్యక్తి ఆవేదన

image

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. మెళియాపుట్టి(M) జాడుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అనంతరం గ్రామంలో జీవనం సాగిస్తుండగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్థానికులు ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు.

News September 8, 2025

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

image

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీ‌హెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.

News September 8, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు