News June 5, 2024

ఎచ్చెర్ల: పాత్రికేయుడి నుంచి ఎంపీగా..

image

రణస్థలం మండలం, వీఎన్ పురానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పాత్రికేయ వృత్తి నుంచి ఎంపీ వరకు ఎదిగారు. రణస్థలంలో గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ అప్పటి ఎచ్చెర్ల MLA స్పీకర్ కావలి ప్రతిభా భారతి అనుచరుడిగా మారారు. ఆమె అతడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పొందూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం ఆయన TDP చేరారు. విజయనగరం YCP బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల మెజార్టీతో కలిశెట్టి విజయం సాధించారు.

Similar News

News March 2, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.

News March 2, 2026

SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు, అక్రమాలకు తావులేకుండా ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు.

News March 2, 2026

SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.