News April 27, 2024

ఎచ్చెర్ల: మళ్లీ వైసీపీ గూటికి చేరిన పైడి శ్రీనివాసరావు

image

ఇటీవల వైసీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గానికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

image

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

News December 25, 2025

సిక్కోలు సిన్నోడు SUPER

image

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే గగనం.. అలాంటిది శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలిపేట గ్రామానికి చెందిన పైడి.సతీష్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. UPSC లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్, AMIIS లో నర్సింగ్ ఆఫీసర్, తెలంగాణలో MHSRB, 51 ర్యాంకుతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సంపాదించాడు. సతీష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

News December 25, 2025

శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.