News August 30, 2025
ఎచ్చెర్ల: వర్శిటీలో నూతన సమావేశ మందిరానికి ‘గిడుగు’ పేరు

డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పరిపాలనా భవనంలో ఒక సమావేశ మందిరానికి గిడుగు వేంకట రామ్మూర్తి పేరు పెట్టనున్నట్లు వర్శిటీ వీసి. రజని తెలిపారు. శుక్రవారం గిడుగు జయింతిని క్యాంపస్లో నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి వర్శిటీ అధికారులు నివాళులర్పించారు. చరిత్ర కలిగిన తెలుగు భాషను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
Similar News
News February 3, 2026
శ్రీకాకుళం: 2 నెలల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే విషాదం

ఆమదాలవలస మండలం చీమలవలసకి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(47) అనే మహిళని భోగాపురం వద్ద కారు ఢీకొని మృతి చెందింది. గత కొన్నేళ్లుగా క్రితం భర్త రమణమూర్తితో కలిసి భోగాపురంలో నివాసం ఉంటొంది. తన పెద్దకుమార్తె గాయత్రీకి మరో రెండు నెలల్లో వివాహం, పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు ఉండగా వెంకటలక్ష్మి ఈనెల 1వ తేదీ రాత్రి సర్వీసు రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
News February 3, 2026
శ్రీకాకుళం: ముగుస్తున్న సర్పంచ్ల పదవీ కాలం.. ఎన్నికలు జరుగుతాయా?

గ్రామపంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. ఇప్పటికే గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉండగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షలు, జన, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా ప్రత్యేక అధికారులు వస్తారా అనే సందిగ్ధం నెలకొంది.
News February 3, 2026
రాష్ట్రంలో ఆటవిక దాడులు కొనసాగుతున్నాయి: సీదిరి

రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట ఆటవిక దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్సీపీ శ్రేణులతో కలిసి సోమవారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి పైనా జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు.


