News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
Similar News
News February 3, 2026
శ్రీకాకుళం: 2 నెలల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే విషాదం

ఆమదాలవలస మండలం చీమలవలసకి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(47) అనే మహిళని భోగాపురం వద్ద కారు ఢీకొని మృతి చెందింది. గత కొన్నేళ్లుగా క్రితం భర్త రమణమూర్తితో కలిసి భోగాపురంలో నివాసం ఉంటొంది. తన పెద్దకుమార్తె గాయత్రీకి మరో రెండు నెలల్లో వివాహం, పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులు ఉండగా వెంకటలక్ష్మి ఈనెల 1వ తేదీ రాత్రి సర్వీసు రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
News February 3, 2026
శ్రీకాకుళం: ముగుస్తున్న సర్పంచ్ల పదవీ కాలం.. ఎన్నికలు జరుగుతాయా?

గ్రామపంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. ఇప్పటికే గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉండగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షలు, జన, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా ప్రత్యేక అధికారులు వస్తారా అనే సందిగ్ధం నెలకొంది.
News February 3, 2026
రాష్ట్రంలో ఆటవిక దాడులు కొనసాగుతున్నాయి: సీదిరి

రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట ఆటవిక దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్సీపీ శ్రేణులతో కలిసి సోమవారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి పైనా జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు.


