News April 17, 2025

ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

Similar News

News January 10, 2026

NZB: వారం రోజుల్లో 232 డ్రంకెన్ డ్రైవ్ కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 232 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా రూ.22.40 లక్షల జరిమానా విధించారన్నారు. ఇందులో ఆరుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనదారులు ధ్రువపత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు.

News January 10, 2026

NZB: కలెక్టర్, సలహాదారుని కలిసిన రెడ్ క్రాస్ సభ్యులు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని NZB జిల్లా రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కమిటీ జిల్లా ఛైర్మన్ ఆంజనేయులు జిల్లా రెడ్ క్రాస్ గురించి వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బపూర్ రవీందర్, వరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News January 10, 2026

నిజామాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పొతంగల్ (M) కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. జక్రాన్ పల్లి(M) పడకల్‌కు చెందిన తలారి నరేందర్ (35) సైతం ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. ఆలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్(M) 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ పవార్ (40) దుర్మరణం పాలయ్యాడు.