News October 3, 2025
ఎడపల్లి: మహిళ దారుణ హత్య..!

MHలోని కొండల్ వాడికి చెందిన లింగవ్వ (55)అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఎడపల్లి మండలంలో చోటుచేసుకొంది. గత నెల 28న కనబడకుండా పోయిన ఆ మహిళ శవాన్ని గురువారం అర్థరాత్రి జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ తన ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ శవం గోనెసంచులో చుట్టివుండడంతో పూర్తిగా కుళ్లిపోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 3, 2025
క్రీడలు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి:CP

క్రీడా కార్యక్రమాలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం ఆయన క్రీడాపోటీల ముగింపులో మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమీషనర్ క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.
News October 2, 2025
నిజామాబాద్: సొంత ఊరికి దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సొంత గ్రామమైన నర్సింగ్ పల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మిత్రులను బంధువులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంత బిజీగా ఉన్నా దసరా రోజు తమ సొంత గ్రామమైన నర్సింగపల్లికి తప్పకుండా వస్తామని దిల్ రాజు అన్నారు. గ్రామాల్లోనే నిజమైన భారతదేశం ఉందన్నారు.
News October 2, 2025
NZB: దసరా పండుగ సందర్భంగా సీపీ ఆయుధ పూజ

దసరా పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయుధ పూజా చేశారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ బస్వా రెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి ఆయుధ పూజ, వాహనాల పూజా, బీడీ టీం సామగ్రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏకే 47తో గాల్లో 5 రౌండ్లు కాల్పులు చేశారు.