News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News April 14, 2026

అనంతపురంలో భార్య గొంతు కోసిన భర్త..!

image

తాళి కట్టిన భర్త భార్య గొంతును కోసిన ఘటన అనంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని సైఫుల్లా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య గొంతు కోస్తున్న సమయంలో అడ్డువచ్చిన వ్యక్తిపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం బాధితుణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, రక్షకుడైన క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News April 14, 2026

అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. హనుమకొండ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫైర్ సర్వీస్ ఫ్లాగ్ ఆవిష్కరించి అమరులైన ఫైర్ సర్వీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గోడపత్రికల ఆవిష్కరించారు.

News April 14, 2026

భద్రాచలంలో నేత్రపర్వంగా శ్రీవారి నిత్య కళ్యాణం

image

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించిన అనంతరం బేడా మండపంలో అర్చకులు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.