News March 19, 2024
ఎదురు కాల్పులు..మంచిర్యాల జిల్లా మావోలు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 3, 2025
భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీనగర్ కాలనీ గణపతి

ADB జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో గడ్డితో తయారు చేసిన ప్రకృతి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హరియాలీ నుంచి గడ్డి తీసుకొచ్చి ఈ రూపాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి గణపతి పక్కన ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సందర్శకులను ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు కాలనీ అధ్యక్షుడు పవర్, ప్రధాన కార్యదర్శి బండారి సంతోష్ తెలిపారు.
News September 3, 2025
ADB: ఈనెల 8న అప్రెంటిస్ షిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.
News September 3, 2025
APK ఫైల్స్తో జర జాగ్రత్త: ఆదిలాబాద్ SP

APK ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్లో ఫేక్ అప్లికేషన్ చక్కర్లు కొడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930ను సంప్రదించాలని సూచించారు.